రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహిస్తారు.
- 1,072 చెట్ల కాండాలను తయారు చేస్తారు.
- రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం.
- అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది.
- వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు.
- 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం
- 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం
- 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు.
- తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు.
- జగన్నాథుడి రథం నందిఘోష.
- ఎత్తు సుమారు 46 అడుగులు,
- పదహారు చక్రాలుంటాయి.
- ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు.
- సారథి పేరు దారుక.
- బలభద్రుడి రథం తాళధ్వజం.
- సుభద్రాదేవి రథం దేవదళన్.