ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు.
అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు